(రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి)
ఉదయం పదిగంటల వేళ.
బంగాళాఖాతపు దిక్చక్రం దాటి, పైకెగబాకిన సూర్యుడు విశాఖనగరానికి ఏటవాలుగా వుండి, వేడి శరాల్ని సంధించి ఒదులుతున్నాడు.
జగదాంబ జంక్షన్ హడావుడిగా తిరిగే మనుషులతో, వాహనాలతో సందడిగా వుంది. జూన్ మాసం వచ్చి రెండు వారాలు దాటినా, ఎండలు తగ్గటంలేదు. మధురవాడ నుండి పాత పోస్టాఫీసు వెళ్ళే ఇరవైఐదో నంబరు సిటీబస్సు ఆ సెంటరులో ఆగటంతో దిగింది గురమ్మ. బస్సులోంచి ఎవరో అందించిన తన పెండలందుంపల గంపని మరొకరి సహాయంతో తల మీదకెత్తుకుని, జగదాంబ సినిమాహాలు ముందున్న బస్స్టాపు ఎడంపక్కన తను రోజూ కూర్చుండే చోటుకి వచ్చి చేరింది.
Continue reading ...
(రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి)
విజయనగరం దగ్గర్లోని కోరుకొండ సైనిక్ స్కూల్ లో మా రెండో వాడికి సీట్ రావడంతో పాతికేళ్ళ తర్వాత మళ్ళీ ఇలా విశాఖపట్నం మీదుగా వెళ్ళబోతున్నందుకు గొప్ప థ్రిల్గా వుంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు బయల్దేరే ముందు కూడా అమ్మానాన్నలిద్దరు వంతపాడినట్లు, "రమణా... ఎట్లాగూ అంత దూరం వెళ్తున్నావు. తిరుగు ప్రయాణంలో నైనా విశాఖపట్నంలో దిగి వరాలత్త ఇంటికి వెళ్ళిరా," అంటూ మరీమరీ చెబుతూ, ఆ ఇంటి గుర్తులు కొన్ని చెప్పారు.
Continue reading ...
(రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి)
నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ల క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను.
ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురుబొంగు అవసరం మీకు. అదే నా చిట్టితల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం కురిపిస్తాను. ఎందుకంటే చిట్టితల్లి మాకందరికీ ప్రాణం.
నేను వచ్చిన కొత్తలో ఈ తోటంతా పచ్చగా కళకళలాడేది. నాతోపాటు ఎన్నోరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి. ఇంటి ముందు నుండి ఎవరు వెళ్లినా, మా సౌరభాలకు మత్తెక్కినట్లు ఒక నిముషంపాటు నిల్చొని శ్వాస ఎగబీల్చి వెళ్లేవారు. విషాదమేమంటే- అలా ఆస్వాదించిన వాళ్లే రెండేళ్లుగా ఏదో కాలిన వాసన వేస్తున్నట్లు ముక్కుకు అడ్డుగా చేతిరుమాలు పెట్టుకొని గబగబ వెళ్లిపోతున్నారు.
Continue reading ...